24-09-2025 09:43:46 AM
రాంచీ: జార్ఖండ్లోని గుమ్లా జిల్లాలో బుధవారం ఉదయం భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో నిషేధిత మావోయిస్టు(Banned Maoist) చీలిక సంస్థకు చెందిన కనీసం ముగ్గురు సభ్యులు మరణించారని పోలీసులు తెలిపారు. బిష్ణుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో జార్ఖండ్ జాగ్వార్, గుమ్లా పోలీసులతో కూడిన భద్రతా దళాలకు, జార్ఖండ్ జన ముక్తి పరిషత్ (Jharkhand Jan Mukti Parishad) మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. "ఈ కాల్పుల్లో ముగ్గురు జేజేఎంపీ మావోయిస్టులు మరణించారు. సంఘటనా స్థలం నుండి మూడు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు" అని ఐజీ (ఆపరేషన్స్), జార్ఖండ్ పోలీసు ప్రతినిధి మైఖేల్ రాజ్ మీడియాకి తెలిపారు.