18 April, 2026 | 10:38 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

మూడు నెలల రేషన్ బియ్యం లబ్ధిదారులకు అందించాలి

29-05-2025 07:04 PM

తహసీల్దార్ గంగాసాగర్..

సదాశివనగర్ (విజయక్రాంతి): రేషన్ లబ్ధిదారులకు జూన్ జూలై ఆగస్టు మూడు నెలల రేషన్  బియ్యాన్ని రేషన్ డీలర్లు లబ్ధిదారులకు అందించాలని కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం తహసీల్దార్ గంగాసాగర్(Tahsildar Gangasagar) తెలిపారు. సదాశివనగర్ మండలంలోని ఆయా గ్రామాల్లో రేషన్ బియ్యం సక్రమంగా లబ్ధిదారులకు రేషన్ డీలర్లు అందజేయాలని తహసీల్దార్ గంగాసాగర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశం మేరకు మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి రావడం జరిగిందని తెలిపారు. రేషన్  కార్డు కలిగిన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి రేషన్ బియ్యం అందజేయాలని తహసీల్దార్ గంగాసాగర్ సూచించారు.