calender_icon.png 27 June, 2025 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానుకోట నుంచి ముగ్గురు ఎంపిక

27-06-2025 12:48:29 AM

మహబూబా బాద్ జూన్ 26 (విజయ క్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లా క్రికెట్ జట్టుకు మహబూబాబాద్ జిల్లా నుండి ముగ్గురు క్రీడాకారులు పెండ్ర శ్రీకాంత్ బురాడే నందు చాపల జస్వంత్ ఎంపికైనట్లు మహబూబాబాద్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి.అజయ్ సారధి రెడ్డి తెలిపారు.

ఇటీవల నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఆరు జిల్లాల ఇంట్రా క్రికెట్ పోటీలు, లీగ్ పోటీల్లో మంచి ప్రతిభ కనబరచడంతో ముగ్గురు క్రీడాకారులను ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టుకు మానుకోట క్రీడాకారులు ఎంపిక కావడం జిల్లాకు రాష్ట్రస్థాయిలో కూడా గుర్తింపు తప్పక లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముగ్గురు క్రీడాకారులు ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టులో స్థానం సంపాదించడం పట్ల కోచ్ మెతుకు కుమార్, సహాయ కోచ్ లు ఐలి సంతోష్, తోట వినయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.