20 July, 2026 | 7:28 PM

Breaking News

పాఠశాలకు వాటర్ ప్లాంట్ విరాళం   •   కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి   •   నూతన ఎస్‌ఐ అనిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉపసర్పంచ్   •   విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి: షీటీం ఎస్ఐ ఫజల్ ఖాన్   •   మితిమీరిన వేగంతో డ్రైవింగ్... కారు బోల్తా యువకుడు మృతి   •   నీట్ పేపర్ లీక్ - కేంద్ర మంత్రి రాజీనామాకు పీవైఎల్ డిమాండ్   •   ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించాలి: డాక్టర్ వై. అనూప్ రావు   •   కాంగ్రెస్ హయాంలోనే మహిళలకు పెద్దపీట - కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్   •   కెల్లేడులో సర్ శత శాతం పూర్తి   •   ఉపసర్పంచులకు విబి జీ రామ్ జీ జాయింట్ చెక్ పవర్ అమలు చేయాలి   •  

తలపాగాలు చెత్తబుట్టలలో వేసి..

18-02-2025 01:14 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ఆదివారం 112 మంది అక్రమవలసదారులతో అమృత్‌సర్‌కు చేరుకున్న విమానంలో.. వచ్చిన జితేందర్ సింగ్ అనే వ్యక్తి పలు ఆరోపణలు చేశారు. ‘అమెరికా వెళ్లేందు కు ఓ ఏజెంట్‌కు రూ. 50 లక్షలు ముట్టజెప్పా. కానీ అతడు నన్ను అక్రమ మా ర్గంలో తీసుకెళ్లాడు. అమెరికాకు చేరుకునేందుకు పనామా అడవుల ద్వారా వెళ్లి ఎన్నో కష్టాలు పడ్డాం.

అమెరికా అధికారులు ఇక్కడకి తీసుకొచ్చే కంటే ముందు రెండు వారాల పాటు అగ్రరాజ్యంలోని డిటెన్షన్ క్యాంప్‌లో ఉంచారు. ఆ క్యాం ప్‌లో మమ్మల్ని చిత్రహింసలకు గురి చేశారు. మాకు సరైన ఆహారం కూ డా అందించలేదు. నా టర్బైన్ (సిక్కుల తల పాగా)ను బలవంతంగా తీసి చెత్తబుట్ట లో పడేశారు’ అని అతడు తెలిపాడు.