calender_icon.png 21 November, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తులతో కిటకిటలాడిన తుమ్మలపల్లి

21-11-2025 12:00:00 AM

రామలింగేశ్వర స్వామికి పూజలు

చండూరు, నవంబర్ 20 (విజయక్రాంతి): గురువారం కార్తీక మాసం చివరి అమావాస్య సందర్భంగా నల్లగొండ జిల్లాలోని తుమ్మలపల్లి రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి గణపతి పూజ, పుణ్య వాచనం, రుద్ర హోమము, మృత్యుంజయ హోమము, నవగ్రహాల హోమము నిర్వహించారు. భక్తులు స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచి చేరుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కార్యనిర్వారాధికారి నాగిరెడ్డి ఆధ్వర్యంలో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు.

సంఘం యాదయ్య, మనమ దంపతులు అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చండూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకన్న యాదవ్, దేవాలయ చైర్మన్ గుండ్రెడ్డి రమ్య రామలింగారెడ్డి, కురుపాటి సుదర్శన్, గుండ్రెడ్డి సంజీవరెడ్డి, జక్కలి శేఖర్, భూతరాజు లింగయ్య, కురుపాటి లింగస్వామి, జక్కలి నాగరాజు, అయ్యప్ప స్వాముల, ఆంజనేయులు స్వాముల అర్చక బృందం, కారు వంగ నరసింహ శర్మ, తిరుపతయ్య శర్మ, శంకర్ శర్మ, గిరి ప్రసాద్ శర్మ, ధర్మకర్తలు కురుపాటి వెంకటమ్మ, మత్తయ్య పాల్గొన్నారు.