5 May, 2026 | 1:49 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

పెద్దపులి కదలికలపై అప్రమత్తంగా ఉండాలి

18-07-2025 10:27 PM

రాష్ట్ర ప్రిన్సిపల్  చీప్  కన్జర్వేటర్ ఫారెస్ట్ అధికారి ఏలు సింగ్ మేరు

కామారెడ్డి,(విజయక్రాంతి): పెద్దపులి సంచారం పట్ల అటవీశాఖ అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ అధికారి ఏలు సింగ్ మేరు అన్నారు. శుక్రవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డి పేట గ్రామ శివారులోని స్కూల్ తండా అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. గత గురువారం పెద్దపులి సంచారం చేసి ఆవును చంపివేసిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి విధితమే. పెద్దపులి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తూ రాష్ట్ర కార్యాలయానికి పంపించాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.

అటవీశాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పెద్దపులి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. పెద్దపులి అడుగుజాడలను అధికారులు ఆయనకు చూపించారు. పెద్దపులి అచూకీ కోసం ఏర్పాటుచేసిన ట్రాక్ కెమెరాలను పరిశీలించారు. పెద్దపులి  కదలికలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ సమాచారం అందించాలని సూచించారు. పెద్దపులి ఎక్కడ ఉంది ఎక్కడ సంచారం చేస్తుంది అనే విషయాలను అప్రమత్తంగా కనిపె పెడుతూ సమాచారం అందించాలన్నారు. అంతకుముందు ఆయన కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో వనమ ఉత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలను నాటారు.