15 April, 2026 | 1:17 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

ఘనంగా చింతలగట్టు జాతరలో తిరుగువారం పండుగ

05-02-2026 12:00 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చింతల గట్టు వట్టి వాగు గబ్బిలాల మడు గు,  సమ్మక్క సారలమ్మ జాతర ముగింపు సందర్భంగా బుధవారం తిరుగువారం పండుగ ఘనంగా నిర్వహించారు. ఆదివాసి పూజారులు గద్దెల ప్రాంగణాన్ని శుభ్రం చేసి పూజలు నిర్వహించారు. తెలుగు వారం పండగ వేడుకలో ఆదివాసి పూజారులు దారం సిద్దు, జాతర కమిటీ అధ్యక్షుడు కారం లక్ష్మయ్య ఆధ్వర్యంలో సంప్రదాయ పద్ధతిలో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు వన దేవతలకు బోనాలతో తరలివచ్చి నైవేద్యం సమర్పించారు. పెద్ద ఎత్తున తిరుగు వారం వేడుకకు భక్తులు హాజరయ్యారు.