30-06-2025 08:32:06 AM
తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanam) సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి(Srivari Sarva Darshan) 10 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీవారి సర్వ దర్శనానికి 10 కంపార్డుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 88,497 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,054 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.34 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు(TTD officials) ప్రకటించింది. తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నేటి నుంచి జులై 2 వరకు శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వహించనున్నారు.