30-06-2025 08:17:18 AM
హైదరాబాద్: మాదాపూర్ సున్నం చెరువులోని ఆక్రమణలను హైడ్రా(Hyderabad Disaster Response and Asset Protection Agency) అధికారులు సోమవారం తొలగిస్తున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను హైడ్రా నేలమట్టం చేస్తోంది. సున్నం చెరువును హైడ్రా రూ. 10 కోట్లతో అభివృద్ధి చేస్తోంది. 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో(Sunnam Cheruvu) భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. చెరువు సమీపంలో అక్రమంగా చేసిన బోరు మోటార్లను హైడ్రా తొలగిస్తుంది. సున్నం చెరువు సమీపంలో ఏళ్ల తరబడి అక్రమ నీటి వ్యాపారం సాగుతోంది. సున్నం చెరువు పరిధిలోని భూగర్భజలాలను వినియోగించవద్దని హైడ్రా సూచించింది. అక్రమంగా నీటిని తరలిస్తున్న పలు వాటర్ ట్యాంకర్లను పోలీసులు సీజ్ చేశారు.