25-05-2025 08:55:21 AM
అమరావతి: తిరుమల తిరుమల దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanams) భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమలకు వెళ్లిన భక్తులు కంపార్ట్మెంట్లన్నీ నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి(Srivari Sarva Darshan) 24 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు ఆదివారం ప్రకటించారు. శనివారం తిరుమల వెంకన్నను 90,211 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.11 కోట్లు వచ్చినట్లు టీటీడీ(TTD) ప్రకటించింది. ఆదివారం సెలవు దినం కావడంతో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దైవ దర్శనం కోసం తిరుమల కోండకు చేరుకున్నారు. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.