25-05-2025 08:44:36 AM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం(Shamshabad Mandal) షాపూర్ హైవే పై ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఘోర శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక పోలీసు కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటనలో హెడ్ కానిస్టేబుల్ విజయ్ కుమార్(Head Constable Vijay Kumar) దుర్మరణం పాలయ్యారని అధికారులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో పెద్ద షాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం గురించి శంషాబాద్ పోలీసులకు సమాచారం అందింది. ఆ సమాచారం మేరకు, శంషాబాద్ నుండి ఒక పోలీసు బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించి, సంఘటనపై విచారణ జరిపి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ పోలీసులతో కలిసి ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తోంది. “రాత్రి 10.45 గంటల ప్రాంతంలో, వేగంగా వస్తున్న ట్రక్కు వచ్చి రోడ్డుపై వెళ్తున్న రెండు పోలీసు వాహనాలను ఢీకొట్టి, ఆపై పోలీసులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మరణించగా, మరో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు” అని శంషాబాద్ ఇన్స్పెక్టర్ కె. నరేందర్ రెడ్డి తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విజయ్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. ట్రక్కు డ్రైవర్పై కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.