17-07-2025 09:10:36 AM
తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanam) భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. 75,104 మంది భక్తులు నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 31,896 మంది భక్తులు నిన్నశ్రీవారికి తలనీలాలు సమర్పించారు. బుధవారం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.66 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. పుష్ప పల్లకి సేవలో పవిత్రమైన సాలకట్ల ఆణివార ఆస్థానంలో, శ్రీదేవి-భూదేవిలతో కలిసి శ్రీ మలయప్ప స్వామి తిరుమల మాడ వీధుల వెంబడి గొప్ప పూల పల్లకీ ఊరేగింపులో భక్తులను ఆశీర్వదించారు.