calender_icon.png 13 June, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమలగిరి.. అభివృద్ధి ఏది?

12-06-2025 12:52:14 AM

  1. మున్సిపాలిటీలో అధిక ఆదాయం.. వసతుల కల్పనలో వెనుకబాటు తనం..
  2. సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేక కాలనీవాసుల ఇబ్బందులు. వెలగని విద్యుత్ దీపాలు
  3. వీధుల్లో కుక్కలు, పందుల స్త్వ్రర విహారం
  4. తిరుమలగిరిలో పేరుకుపోయిన మురుగునీరు

తిరుమలగిరి, జూన్ 11 : అది ఒక మున్సిపాలిటీ. ఆదాయ వనరులు అధికంగానే ఉన్నాయి కానీ చేసే అభివృద్ధి పనుల్లో మాత్రం పూర్తిగా వెనుకబడిపోయిందనేది ఆ పట్టణాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. అదే తుంగతుర్తి నియోజకవర్గం లోని తిరుమలగిరి మున్సిపాలిటి. ఆదాయం ఫుల్.. అభివృద్ధి నిల్.. :

మున్సిపాలిటీలో  ఇంటి పన్నులు, నల్ల బిల్లులు, ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ బిల్లులు, సంత వేలపాట బిల్లులు వీటన్నిటితో పాటు ప్రభుత్వం మున్సిపల్ అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నడంతో ఆదాయం ఫుల్ గానే ఉంది. ఇంత ఆదాయం ఉన్నప్పటికీ కనీస వీధుల వెంట సిసి రోడ్లు, డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడంతో పట్టణవాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.                   

దోమలు, పందులకు నిలయంగా  : 

తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంగా ఏర్పడిన నాటినుండి దోమలకు స్ప్రే చేయకపోవడంతో అపరిశుభ్రతకు ఆడవాళ్ళుగా మారిపోయింది. దీంతో పలు కాలనీల వాసులు అనారోగ్యానికి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు మున్సిపల్ సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల కుక్కలు, పందులు విపరీతంగా పెరిగిపోయి వీధుల వెంట మనుషులు తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదే విషయంపై అనేక దఫాలుగా అధికారులకు మెమొరడం ద్వారా తెలియపరచినప్పటికీ కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలనుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి .ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి పరిశుభ్రత చర్యలు చేపట్టడంతో పాటు వీధులలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు

 పట్టణంలో వెలగని స్ట్రీట్ లైట్లు

పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారిపై ఉన్నటువంటి స్ట్రీట్ లైట్లు గత కొద్ది నెలలుగా వెళ్లకపోవడంతో ప్రమాదాలకు తావు తీస్తు కొంతమంది మరణించడం జరిగింది ఇకనైనా అధికారులు మేలుకొని స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. 

పారిశుధ్యంపై దృష్టి సారించాలి 

పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో   దోమలు పందులు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు అనారోగ్యానికి గురై హాస్పటల్ పలాయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు మేలుకొని సమస్యలు పై దృష్టి సాధించాలి. 

 పి మల్లేష్ పట్టణవాసి

 పలు సమస్యలు పరిష్కరిస్తాం

పట్టణం లో ఉన్నటువంటి డ్రైనేజీలు సిసి రోడ్లు దోమలు పందుల నివారణకు తగు చర్యలు తీసుకొని ప్రతిరోజు శానిటైజింగ్ మురికి కాలువల శుద్ధికరణ వీధిలైట్ల ఏర్పాటుకు కృషి చేస్తాం పట్టణ ప్రజల ఆరోగ్యమే మా ప్రధాన కర్తవ్యo

 బి .యాదగిరి 

మున్సిపల్ కమిషనర్