15 April, 2026 | 11:59 AM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

ప్రస్తుత సమాజానికి కావాల్సిన సినిమా 45

17-04-2025 12:00 AM

శివరాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బీ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘45’. ఉమారమేశ్‌రెడ్డి, ఎం రమేశ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు అర్జున్ జన్యా ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు.  మేకర్స్ బుధవారం హైదరాబాద్‌లో ఏర్పా టు చేసిన టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఉపేంద్ర మాట్లాడుతూ.. “45’ చిత్రంలో నన్ను చాలా కొత్తగా చూపించారు దర్శకుడు అర్జున్.

ఆయన కథ చెప్పేందుకు వచ్చినప్పుడు నేను ఇంట్లో కాజువల్‌గా ఉన్నా. అదే గెటప్ మూవీలో ఉండాలని చెప్పారు” అన్నారు. హీరో శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ.. “ఈ మూవీ షూ టింగ్ చివరలో నాకు క్యాన్స ర్ అని తెలిసింది. కీమో థెరపీ తీసుకుంటూనే షూ టింగ్ చేశా” అని చెప్పారు. దర్శకుడు అర్జున్ జన్యా మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కు డైరెక్షన్ చేయాలని శివరాజ్‌కుమార్ చెప్పిన మాట తోనే ఈ సినిమాకు దర్శకత్వం చేయగలిగా. ఉపేంద్ర దర్శకులకే దర్శకుడు.

ఈ మూవీని ముందు గా సీజీ, డైలాగ్స్, బీజీఎంతో సహా విజువలైజ్ చేసి, ఆ తర్వాత షూటింగ్ చేశాం. అలా చేస్తే ఒక్క సీన్ వేస్టేజ్ ఉండదు. బడ్జెట్ ఆదా అవుతుంది. తెలుగు దర్శకులూ ఇలా ప్రయ త్నం చేస్తారని ఆశిస్తున్నా’ అన్నారు. నిర్మాత ఎం రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇలాంటి కాన్సెప్ట్ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా రాలేదని చెప్పగలను. ఇప్పుడున్న సామాజిక పరిస్థితులకు 45 లాంటి మూవీ కావాలి. సనాతన ధర్మం గురించి ఈ చిత్రం లో అంశాలుంటాయి’ అని తెలిపారు.