19-06-2025 12:54:34 AM
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాం తి): రాష్ట్రంలోని గ్రామీణ తాగునీటి సమస్యలకు సులభంగా పరిష్కారం లభించ నున్నది. తాగునీటి సమస్యలపై ఫిర్యాదుల కోసం నాలుగు అంకెల టోల్ ఫ్రీ నంబర్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలకు సులువుగా గుర్తుండేలా కొత్త నంబర్ను ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి సీతక్క ఆదేశాల మేరకు 11 అంకెల టోల్ఫ్రీ స్థానంలో 1916 నంబర్ తీసుకొచ్చింది. టోల్ ఫ్రీ ద్వారా వచ్చే ఫిర్యాదులను మిషన్ భగీరథ సిబ్బంది సత్వరమే పరిష్కరిస్తున్నారు.
మిషన్ భగీరథ శాఖలో గ్రామీణ తాగునీటి సమస్యల ఫిర్యాదులను పరిష్కరించడానికి గతంలో 1800 599 4007 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉండేది. రాష్ట్రవ్యాప్తంగా మిషన్ భగీరథ సేవలు అందుకుంటున్నవారిలో ప్రధానంగా గ్రామీణులు ఈ 11 అంకెల టోల్ ఫ్రీ నంబర్కు డయల్ చేయడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు అంకెల నంబర్ను వినియోగించుకునేలా మిషన్ భగీరథ విభాగం సౌకర్యం కల్పించింది.