19-06-2025 12:56:15 AM
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నల్లగొండ టౌన్, జూన్ 18 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అబద్దాలతో పాలన సాగిస్తూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో రైతు భరోసా 15 వేలు ఇస్తా అని చెప్పి రైతాంగాన్ని మోసం చేసిందని అన్నారు.
కానీ కెసిఆర్ ఏ హామీ లేకుండనే ఎకరానికి 12 వేల రైతుబందు ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తుందని దు య్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కెసిఆర్ జమ చేసిన డబ్బులను కూడా రైతులకు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు కమిషన్లు తీసుకుని బిల్లులు ఇచ్చారని మండిపడ్డారు.
ఇపుడు ఎన్నికలు వస్తున్నాయని రైతు భరోసా ఇస్తాడట.. ఒక్కో రైతుకు కాంగ్రెస్ సర్కార్ 30 వేలు బాకీ పడ్డదని తెలిపారు. సమావేశంలో ఆ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.