28-11-2025 02:38:02 PM
హైదరాబాద్: తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్(KCR) వాడుకున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్(Bomma Mahesh Kumar Goud) గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. ఇప్పుడు దీక్ష దివస్(Deeksha Divas) పేరుతో మరోసారి సెంటిమెంట్ రాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని మహేష్ కుమార్ సూచించారు. కేసీఆర్ చేసిన దీక్ష ఒక నాటకమని తెలిపారు. కేసీఆర్ మూడు రోజులకే దీక్ష ముగించి పలాయనం చిత్తగించారని మహేష్ కుమార్ పేర్కొన్నారు. దీక్షను మధ్యలోనే విరమిస్తే.. విద్యార్థి సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చిందని ఆయన వివరించారు. కేవలం కేసీఆర్(Kalvakuntla Chandrashekar Ra) వల్ల తెలంగాణ రాలేదు.. కాంగ్రెస్ వల్ల తెలంగాణ వచ్చిందని వెల్లడించారు. పొట్టి శ్రీరాములు చేసిన దీక్షకు.. కేసీఆర్ దీక్షకు పొంతన లేదని ఆరోపించారు.
ఉద్యమంలో ఎవరి బిడ్డలు చనిపోయారో అందరికీ తెలుసన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ కుటుంబంలో, బంధువుల్లో ఎవరైనా చనిపోయారా? అని ఆయన ప్రశ్నించారు. ఉద్యమంలో పాల్గొన్న పేదలు, విద్యార్థులు, ఎస్టీలు, ఎస్సీలు, ఆత్మార్పణం చేసుకున్నారని సూచించారు. పేదలు, విద్యార్థులు, ఎస్సీలు, ఎస్టీల త్వాగాల వల్లే తెలంగాణ వచ్చిందని తెలిపారు. పేదల త్యాగాల వల్ల వచ్చిన తెలంగాణను పదేళ్లపాటు కేసీఆర్ కుటుంబం దోచుకున్నదని విమర్శించారు. ఆనాడు కిరోసిన్ పోసుకున్న హరీశ్ రావుకు అగ్గిపెట్ట ఎందుకు దొరకలేదు? అని మహేష్ కుమార్ ప్రశ్నించారు. సోనియా గాంధీ(Sonia Gandhi) దయ లేకుంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదని తేల్చిచెప్పారు. సోనియా తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారు కాదని మహేష్ గౌడ్ తెలిపారు.