10 April, 2026 | 2:30 PM

Breaking News

తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •   తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త   •   సిఎం సహాయ నిధి పేదలకు వరం   •   ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం— పాల్గొన్న మంత్రి పొంగులేటి   •   గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి...   •   పోటు రంగారావుకి ఎన్ఐఏ నోటీసు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: నామాల ఆజాద్   •  

కవిత అరెస్ట్

28-11-2025 01:58 PM

హైదరాబాద్: తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత(Telangana Jagruthi President Kavitha) బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కామారెడ్డిలో రైల్ రోకో నిర్వహించారు. రైల్ రోకోలో జాగృతి కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కవిత రైలు పట్టాలపై బైఠాయించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో కవిత చేతికి స్వల్పగాయం అయింది. కవితను అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీసీల కోసం పోరాడుతున్న కల్వకుంట్ల కవితను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కామారెడ్డి జిల్లాకు నీళ్లు రాలే

కాళేశ్వరం ద్వారా కామారెడ్డికి ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదని కవిత ఆరోపించారు. ప్యాకేజీ 21,22 ద్వారా కాంట్రాక్టర్లకే డబ్బులు పోయాయని తెలిపారు. డబ్బులన్నీ కాంట్రాక్టర్లకే పోయాయి తప్ప.. ప్రజలకు మేలు జరగలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం చెబితే బీఆర్ఎస్(BRS) వాళ్లు నా మీద నోరు వేసుకొని పడిపోతారని కవిత సూచించారు. నాపై కుట్ర చేసి నా కుటుంబం నుంచి దూరం చేశారని తెలిపారు. మరో కుటుంబమైనా తెలంగాణ కోసం.. ధైర్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో మొదటి ద్రోహి బీజేపీ, రెండో ద్రోహి కాంగ్రెస్ అన్నారు. బీసీ రిజర్వేషన్లపై రెండు బిల్లులు రాష్ట్రపతి వద్ద ఆగిపోయాయని కవిత తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) కొడంగల్ పై చూపిన ప్రేమ కామారెడ్డిపై చూపటం లేదని కవిత ఆరోపించారు.