28-11-2025 01:58:11 PM
హైదరాబాద్: తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కామారెడ్డిలో రైల్ రోకో నిర్వహించారు. రైల్ రోకోలో జాగృతి కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రైలు పట్టాలపై బైఠాయించారు. తోపులాటలో కవిత చేతికి స్వల్పగాయం అయింది. కవితను అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు.బీసీల కోసం పోరాడుతున్న కల్వకుంట్ల కవితను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.