08-09-2025 01:19:13 AM
పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి
పురావస్తు పరిశోధకుడు డా.ఈమని శివనాగిరెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): హైదరాబాద్ నగర శివారులోని నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవులలో ఆదిమానవుని ఆనవాళ్లు గుర్తించిన ట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డా.ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
మూసి పరిసరాల్లలో ఆదివారం జరిపిన పురావస్తు అన్వేషణలో భాగంగా స్థానిక వీరభద్రాలయ వంశ పారంపర్య అర్చకులు మాడపాటి పరమేశ్వర ఇచ్చిన సమా చారం మేరకు ఈ ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఆల య ప్రాంగణంలోని రాతి పరుపుపై దాదా పు 15 చోట్ల కొత్తరాతి యుగం నాటి రాతి గొడ్డళ్లను పదును పెట్టేందుకు నూరిన (అరగదీసిన) గాళ్లు ఉన్నాయని, అవి 15 సెంటీమీటర్ల పొడవు, 3 సెంటీమీటర్ల వెడల్పు, 2 సెంటీమీటర్ల లోతు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
మూసి ఒడ్డునున్న వీరభద్రాలయ చుట్టుపక్కలగల రాతి చరియల కింద గుహల్లోనూ కొత్త రాతియుగం వారు నివసించారని, జంతువుల వేట, పశుపోషణ, కొద్దిపాటి వ్యవసా యానికి మూసి నీటి వనరులతో జీవనం సాగించారని తెలిపారు. ఈ ఆనవాళ్లు హైదరాబాద్ నగర చరిత్రను ఆరు వేల సంవత్స రాల పూర్వానికి తీసుకెళ్తున్నాయని వెల్లడించారు.
ఈ ఆనవాళ్లకు చారిత్రక వివరాలతో పేరు పలకలను ఏర్పాటు చేసి, మంచిరేవులును పురావస్తు పర్యాటక స్థావరంగా తీర్చిదిద్దాలని నార్సింగ్ మున్సిపాలిటీ అధికారులను ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్ర మంలో ఐడీసీ, మేనేజింగ్ డైరక్టర్ శ్రీనివాస్ బందా, సమతా మూర్తి శిల్పి డీఎస్వీ ప్రసా ద్, స్థపతి, రాఘవేంద్ర సాగర్ పాల్గొన్నారు.