20-06-2025 09:47:20 AM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట(Pedda Amberpet) వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. టిప్పర్, బైకు ఢీకొని ట్రాఫిక్ కానిస్టేబుల్(Traffic Constable) దుర్మరణం పాలయ్యారు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్(ORR Service Road)లో రాత్రి ఆగి ఉన్న టిప్పర్ ను బైకు ఢీకొట్టింది. మృతుడు యాదాద్రి పోలీస్ స్టేషన్(Yadadri Police Station)లో పని చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మాన్ సింగ్ గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.