20-06-2025 08:30:11 AM
తిరుమలగిరిలో నలుగురు అరెస్ట్
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్(Secunderabad Cantonment) ఆర్మీ ఆధీనంలోని ప్రాంతంలోకి చొరబడిన నలుగురు అరెస్ట్ అయ్యారు. తిరుమలగిరిలో ఎంసీఈఎంఈలోని(MCEME) టెక్నో చౌక్ గేటులోకి నలుగురు వ్యక్తులు ప్రవేశించారు. నకిలీ వైమానికదళ అధికారి గుర్తింపు కార్డులతో అనుమతి లేకుండా ప్రవేశించారు. ఆర్మీ రహస్య ప్రాంతంలో ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తుండగా అధికారులు ప్రశ్నించారు. కీలక సమాచారంపై ఫొటోలు, వీడియోలు తీసుకోవడంపై పట్ల పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. లెఫ్టినెంట్ కల్నల్(Lieutenant Colonel) ఫిర్యాదులో తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అదుపులోకి విచారిస్తున్నారు.