calender_icon.png 17 January, 2026 | 8:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్ నివారణకు వాహనాల దారి మళ్లింపు చర్యలు

17-01-2026 12:00:00 AM

నల్గొండ ఎస్పీ  శరత్ చంద్ర పవార్

చిట్యాల, జనవరి 16 (విజయ క్రాంతి): జాతీయ రహదారి- 65 (హైద్రాబాద్- విజయవాడ) పై చిట్యాల మరియు పెద్ద కాపర్తి వద్ద ప్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున ట్రాఫిక్ జామ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నందున ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేకమైన దారి మళ్లింపు చర్యలు  చేపట్టిందని గురువారం నల్గొండ జిల్లా ఎస్పి  శరత్ చంద్ర పవర్ తెలిపారు. ఈ సందర్భంగా 

గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు : 

గుంటూరు - మిర్యాలగూడ- హాలియా - కొండమల్లేపల్లి - చింతపల్లి - మాల్ మీదుగా హైదరాబాద్. 

మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు :

మాచర్ల - నాగార్జునసాగర్ - పెద్దవూర - కొండపల్లేపల్లి - చింతపల్లి - మాల్ మీదుగా హైదరాబాద్. 

నల్లగొండ నుంచి  హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు : 

నల్లగొండ - మార్రిగూడ బై పాస్ - మునుగోడు- నారాయణపూర్ -చౌటుప్పల్ (ఎన్.హెచ్ 65)మీదుగా హైదరాబాద్.

విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారి వాహనాలు:

కోదాడ - హుజూర్నగర్ - మిర్యాలగూడ -  హాలియా -  చింతపల్లి - మాల్ మీదుగా హైదరాబాద్. ఎన్. హెచ్ 65  (విజయవాడ -హైదరాబాద్ ) రహదారి పై చిట్యాల-  పెద్దకాపర్తిలో ప్లై ఓవర్ నిర్మాణాలు జరుగుతున్నందున ట్రాఫిక్ జామ్ అయిన పక్షంలో చిట్యాల నుండి భువనగిరిగుండా హైద్రాబాద్ మళ్లించబడను.   ట్రాఫిక్ పోలీసులు కీలక కూడళ్ల వద్ద విధులు నిర్వహిస్తూ, డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ నిఘాతో ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని, ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా డయల్ 100 ని సంప్రదించాలని జిల్లా ఎస్పి కోరారు. కావున వాహనదారులు దీని అర్థం చేసుకొని పోలీసులకు సహకరించాలన్నారు.