26-06-2025 12:51:12 AM
నగర పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం
కరీంనగర్ క్రైం, జూన్25(విజయక్రాంతి):కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్తో వాటి కనెక్టివిటీ మరియు వాటి పనితీరును ఆయన పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరీంనగర్ పట్టణ ప్రజలకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా కరీంనగర్లో ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాలు జూన్ 27నుండి పూర్తిగా అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. ఈ కెమెరాల ద్వారా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను పర్యవేక్షిస్తామని, తదనుగుణంగా చలాన్లు జారీ చేస్తామని స్పష్టం చేశారు.
ఈ చర్యల యొక్క ప్రధాన లక్ష్యం పౌరుల భద్రతను పెంచడం, రోడ్డు ప్రమాదాలను నివారించడం మరియు నగరంలో ట్రాఫిక్ను నియంత్రించడం అని కమిషనర్ పేర్కొన్నారు.కార్యక్రమంలో కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు బిల్లా కోటేశ్వర్, ఖరీముల్లా ఖాన్, రమేష్, వెంకటేష్, ఇతర అధికారులు, సిబ్బందిపాల్గొన్నారు.