23-05-2025 02:00:55 AM
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
భద్రాద్రి కొత్తగూడెం, మే 22, (విజయక్రాంతి) భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ల ప్ర క్రియకు భూమి సర్వే చేయడం నిమిత్తం లైసెన్సు సర్వేయర్లుగా ఎంపికైన వారికి ఈనె ల 26 నుండి జూలై 26 వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితే ష్ వి. పాటిల్ తెలిపారు. కొత్తగూడెం మై నింగ్ కళాశాలలో లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కోసం జరుగుతున్న ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కళాశాలలో తరగతి గదులు, డ్రాయింగ్ రూ మ్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 426 మంది అభ్యర్థులకు 50 రోజుల పని దినాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణలో భాగంగా అభ్యర్థులకు ఉదయం 9 గంటలకు క్షేత్రస్థాయిలో శిక్షణ, 10 గంటల నుండి సాయం త్రం ఐదు గంటల వరకు థియరీ, ప్రాక్టికల్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు.
శిక్షణ కోసం అవసరమైన ప్రొజెక్టర్లు, బోర్డులు తదితర అన్ని పరికరాలు ఏర్పాటు చేయాలని అ ధికారులను ఆదేశించారు. భూభారతి చట్టం అమలులో సర్వేయర్ల పాత్ర కీలకమని కాబ ట్టి శిక్షణ తరగతులలో అభ్యర్థులకు భూభారతి చట్టంపై పూర్తి అవగాహన కల్పించా లన్నారు.ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ఉ మ్మడి ఖమ్మం జిల్లా మైనింగ్ కళాశాలల ఏడి శ్రీనివాస్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ డి.శ్రీనివాస్ , మైనింగ్ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.