02-06-2025 02:10:21 AM
సీపీఐ నియోజక వర్గ కార్యదర్శి అజయ్ సారథిరెడ్డి
మహబూబాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలులో లబ్ధిదారుల ఎంపికలో పూర్తిగా పారదర్శకత పాటించాలని సిపిఐ మహబూబాబాద్ నియోజకవర్గ కార్యదర్శి అజయ్ సారధి రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముడుపుగల్ గ్రామంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 16 వ గ్రామ మహాసభ ను పోలగాని శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన మహాసభ కు ముఖ్యఅతిధిగా హాజరైన అజయ్ సారధి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో సిపిఐ అధ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు.
నిత్యం ప్రజలకు అందుబాటులో వుంటూ స్థానిక సమస్యలపై నిరంతర పోరాటాలు నిర్వహిస్తు ప్రజాక్షేత్రం లో ఉంటున్న వారిని ఆదరించాలన్నారు. సంక్షేమ పథకాల అమలులో అర్హులైన వారికి దక్కేల పార్టీ శ్రేణులు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి తండా సందీప్, కాట్లోజు పాండురంగచారి, సిపిఐ పట్టణ కార్యదర్శి పెరుగు కుమార్, లింగ్య నాయక్, సతీష్, సాయి, శేఖర్, కృష్ణ, అప్పయ్య, మునీందర్, గురుస్వామి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.