calender_icon.png 6 June, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణాన్ని సైక్లింగ్‌తో కాపాడుకోవాలి

02-06-2025 02:08:25 AM

హనుమకొండ, జూన్ 1 (విజయ క్రాంతి): హనుమకొండ నగరంలో ఈరోజు ఉదయం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడామంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం మైభారత్ సంస్థ ఆధ్వర్యంలో, ఏజే పెడల్స్ అండ్ ట్రై సిటీ రైడర్స్ అనుసంధానంతో ‘ఫిట్ ఇండియా  సండేస్ ఆన్ సైకిల్‘ కార్యక్రమం భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీని మై భారత్, ఏజే పెడల్స్, ట్రైసిటీ రైడర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించాయి.

హంటర్ రోడ్ నుండి మై భారత్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్  సమక్షంలో ప్రారంభమైన ఈ ర్యాలీ నగర సర్క్యూట్లో సాగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, సైక్లింగ్ ప్రేమికులు, ఆరోగ్య కార్యకర్తలు, స్థానిక ప్రజలు, ఎన్‌ఎస్‌ఎస్  కిట్స్ , వరంగల్ విద్యార్థులు, అలాగే ట్రైసిటీ రైడర్స్ అసోసియేషన్ నుండి చంద్రశేఖర్, ఏజే పెడల్స్ నుండి జయంత్, అవినాష్, నిఖిల సుమారు  100 మంది సైక్లిస్టులు.

  ఈ ర్యాలీలో పాల్గొని, ఆరోగ్యపరమైన జీవనశైలిని ప్రోత్సహించారు. ఈ ర్యాలీ ప్రధానంగా ప్రజల్లో ఆరోగ్యపరమైన అలవాట్లను పెంపొందించడం, సైక్లింగ్ ద్వారా శారీరక దృఢత్వాన్ని సాధించడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడడం లక్ష్యంగా నిర్వహించబడింది.