22 June, 2026 | 2:28 PM

Breaking News

బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •  

మేడారంలో గిరిజన సంస్కృతి ఉట్టిపడాలి

09-09-2025 01:25 AM
  1.  సమ్మక్క, సారలమ్మ ఆలయాలను ఆధునీకరించాలి
  2. సమీక్షలో మంత్రులు పొంగులేటి, సీతక్క

హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): ఆసియా ఖండంలోనే అతి పెద్ద దైన గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు అవసరమైన ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన చేపడతున్నా మని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం సచివాలయంలో పంచాయతీరాజ్  శాఖ మంత్రి సీతక్కతో కలిసి పొంగులేటి సమీక్ష నిర్వహించారు.

గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా, గిరిజనుల మనోభావాలకు అ నుగుణంగా ఆలయ ఆధునీకరణ పను లు చేపడుతున్నామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు ఈ పనులను ఈ నెల 15 నుంచి ప్రారంభించి జనవరి మొదటి వారంలోగా పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. సమీక్షలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ పాల్గొన్నారు.