calender_icon.png 19 June, 2025 | 6:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన విద్యార్థులు డీఎల్‌ఈడీ కోర్సుకు దరఖాస్తు చేసుకోండి

18-06-2025 12:27:17 AM

ఐటీడీఏ పీవో రాహుల్

భద్రాచలం,జూన్ 17(విజయ క్రాంతి); 2025 విద్యా సంవత్సరానికి గాను గిరిజన డి ఎల్ ఈ డి కళాశాల 11వ బ్యాచ్ కి ప్ర వేశాల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో మొత్తం 50 సీట్లు  ఉన్నాయన్నా రు.  దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఏజెన్సీ ప్రాంత వాసులు అయ్యి ఉండాలని, విద్యార్థులు ఇంటర్మీడియట్ లో కనీసం 45 శా తం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. ఈనెల 16 నుండి జూలై 10వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు.

గిరిజన డి ఎల్ ఈడి కళాశాల 2014 విద్యా సంవత్సరంలో ప్రారంభమైందని, ఈ కళాశాల కేవలం ఏజెన్సీ ప్రాం త విద్యార్థులను ఉపాధ్యాయులుగా తయా రు చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన ఏకైక ప్రత్యేక కళాశాల అన్నారు.ఈ కళా శాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎటువంటి అర్హత పరీక్షలు లేకుండా కేవలం మెరి ట్ ఆధారంగా సీట్లు ఎంపిక చేయటం, కళాశాలలో ఉన్న ప్రత్యేకత అని, ఈ కళాశాలను 2014లో ఏటపాకలో పక్కా భవనాలతో ఏర్పాటు చేసినప్పటికీ ఆ తర్వాత రాష్ట్ర విభజన సమయంలో ఏటపాక ఆంధ్రకు వెళ్లడం వలన ఈ కళాశాలను 2015 నుండి భద్రాచలంలోని గిరిజన బీఈడీ కళాశాలలో ప్రా రంభించడం జరిగిందన్నారు.

2014 నుండి ఈరోజు వరకు 10 బ్యాచులు పూర్తిచేసుకుని మొత్తం 450 మంది విద్యార్థులకు ఉపాధ్యాయ శిక్షణ ఇవ్వడం జరిగిందని, దాదాపు 49 మంది ఎస్జిటి ఉద్యోగాలు సాధించి ప్ర భుత్వ ఉద్యోగాలు చేయడం గర్వకారణమన్నారు. కళాశాలలో మొత్తం 50 సీట్లు ఉండ గా ,కేవలం తెలంగాణ ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డీఎడ్ కళాశా ల లేకపోవడం వల్ల గిరిజన డి ఎల్ ఈ డి కళాశాలకు ఎస్సీ ఆర్ టి వారు నిర్వహించే ఎఫ్ ఎల్ ఎన్ ట్రైనింగ్, ఇతరత్రా శిక్షణలో ప్రత్యేక గుర్తింపు ఉందని, 2023 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము ఎస్జీటీ పోస్టులకు కేవ లం డి ఈ డి చేసిన వారు మాత్రమే అర్హులు అని తీర్పు ఇవ్వడంతో గిరిజన బి.ఎడ్ కళాశాలకు మరింత ప్రాధాన్యత పెరిగిందన్నారు.

ఈ కళాశాలలో ప్రత్యేకతలు, ఏజెన్సీ షెడ్యూ ల్ ప్రాంత విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేక ఏకైక కళాశాల, ఇంటర్మీడి యట్ మార్కుల ఆధారంగా అనగా పూర్తిగా మెరిట్ ద్వారా సీట్ల కేటాయింపు, ప్రతి సంవత్సరం 100% డిస్టింక్షన్ లో ఫలితాలు, కళాశాల ప్రాంగణంలో మహిళలకు ప్రత్యేకమైన హస్టల్ సదుపాయం, విద్యార్థులకు ప్రత్యేకమైన లైబ్రరీ, అనుభవజ్ఞులైన అధ్యాపకులు బోధన ప్రక్రియలో డీఎస్సీ సంబం ధించిన అంశాలు పాఠ్యాంశాలతో పాటు బోధించుట, టిఎల్‌ఎం వర్క్ షాప్స్ సెమినా ర్స్, డిబేట్స్, పరీక్షలు నిర్వహించుట, నాణ్యమైన విద్యా బోధన, థియరీ , ప్రాక్టికల్ సమ ప్రాధాన్యత కల్పించుట, ప్రతి విద్యార్థి పైన ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని ఆయన అన్నారు.   

కావున దరఖాస్తు చేయు అభ్యర్థులు ప్రిన్సిపాల్, డి ఎల్ ఈ డి కళాశాల చర్ల రోడ్డు భద్రాచలం నందు సంప్రదించాలని, ఈ దరఖాస్తులు ఉట్నూరు మరియు ఏటూరునాగారం ఐటీడీఏలలో కూడా లభిస్తాయ ని ఆయన అన్నారు. మరిన్ని వివరాల కొర కు ప్రిన్సిపాల్ వైకెడి భవాని ఫోన్ నెంబర్లు 9959575539,9949493416 లకు సం ప్రదించి తెలుసుకోవాలని ఆయన కోరారు.