18-06-2025 12:28:05 AM
కార్వాన్, జూన్ 17: గోల్కొండ కోటలో తొలి బోనం సమర్పించిన తర్వాత బోనాల జాతర ప్రారంభమవుతుందని మంత్రి పొ న్నం ప్రభాకర్ పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
గతంలో కంటే ఈ ఏడాది అత్యంత వైభవంగా గోల్కొండ బో నాలను నిర్వహించాలన్నారు. గోల్కొండ బోనాల్లో తొమ్మిది పూజలు ఉంటాయని, గురువారం, ఆదివారం చొప్పున పూజలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు.
గతేడాది ఇబ్బందులు..
గతేడాది లంగర్ హౌస్లో ఇబ్బందులు తలెతాయని, పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాక ర్ అధికారులను ఆదేశించారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దన్నారు. అగ్ని ప్రమాదాల ను దృష్టిలో ఉంచుకొని సంబంధిత శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఆరు మెడికల్ క్యాంపులు
గోల్కొండ బోనాల ఉత్సవాలు భాగంగా మొత్తం ఆరు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఏ విధంగా మూడు చిన్న అంబులెన్స్లను కూ డా ఏర్పాటు చేస్తున్నామన్నారు. మెడికల్ క్యాం పుల వద్ద షీ టీమ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. బోనాల వేడుకల గురించి ఎల్ఈడీ స్క్రీన్లపై డిస్ప్లే చేయాలని సూచిం చారు. అంతకుముందు నాగదేవత అమ్మవారి పుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వ హించారు.
ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కౌసర్ మొయినొద్దీన్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, హైద రాబాద్ కలెక్టర్ హరి చందన, ఎండోమెంట్ అధికారులు, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అను రాగ్ జయంత్, గోల్కొండ ఏసీపీ సయ్యద్ ఫయాజ్, గోల్కొండ బోనాల ట్రస్టీ కమిటీ ఛైర్మన్ చంటిబాబు, కమిటీ సభ్యులు, బొమ్మ ల సాయి బాబా చారి, శివరాజ్ పాల్గొన్నారు.
మంత్రి పొన్నంకు సన్మానం
హైదరాబాద్ ఇన్చార్జి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ను గోల్కొండ మహంకాళి ఆలయ పూజారి సురేష్ చారి సత్కరించారు. గో ల్కొండ బోనాల సందర్భంగా సమీక్ష సమావేశానికి విచ్చేసిన మంత్రికి అమ్మవారి ఫోటోతో పాటు పూజల అనంతరం ప్రసా దం అందజేశారు. ఆలయ సలహాదారు బొమ్మల సాయిబాబాచారి, శివచారి తదితరులు పాల్గొన్నారు.