18-06-2025 12:26:46 AM
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నించేందుకు బదులుగా తనను మాత్రమే టార్గెట్ చేస్తూ పార్టీ నుంచి దూరం పెడుతూ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా, తాను పార్టీ కోసం అంకితభావంతో పనిచేసినట్టు గోషామహల్ ఎమ్మెల్యే రా జాసింగ్ స్పష్టంచేశారు.
తన కోసం కాకుండా, పార్టీ కోసం పనిచేస్తున్న లక్షల మంది కార్యకర్తల మనోబలాన్ని పెంపొందించేందుకు తాను ఇన్నాళ్లు మాట్లా డుతూ వచ్చినట్టు తెలిపారు. సోమవారం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మీడియా సమావేశంలో ‘ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక సీనియర్ నాయకుడు, తాను కేవలం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తను మాత్రమే.. రాజాసింగ్ ఏమి చెబితే దాన్ని మేము పాటిస్తాం’.. అని చేసిన వ్యాఖ్యలపై మంగళవారం రాజాసింగ్ స్పం దించారు.
తమ సమస్యలు చెప్పుకునేందుకు కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి కొంచెం సమయం కేటాయించాల్సిందిగా కోరుతున్నట్టు తెలిపారు. తాను, పార్టీ సహచరులు ఆయనతో వ్యక్తిగ తంగా కలిసి, సమస్యలను తెలియచేస్తామని, తద్వా రా పరస్పర నమ్మకం పెంపొందించుకునేందుకు అ వకాశం ఉంటుందని అన్నారు.
ఎక్కడికి, ఎప్పుడు పిలిచినా వస్తామని తెలిపారు. తాము పార్టీని విభజించడానికి కాకుండా, ఐక్యంగా ఉంచేందుకే ప్రయ త్నిస్తున్నట్టు రాజాసింగ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కోసం వ్యక్తిగత విభేదాలను విడిచిపెట్టి కలిసికట్టుగా పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు స్పష్టంచేశారు.