20-05-2025 08:46:49 PM
శ్రద్ధాంజలి ఘటించిన ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్..
మునుగోడు (విజయక్రాంతి): ఇటీవల మండలంలోని కొంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేదిరే మధుసూదన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి చిన్న మామ అకాలంగా మరణించడంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ శంకర్ నాయక్(MLC Shankar Nayak) మధుసూదన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి, శ్రద్ధాంజలి ఘటించి, కుటుంబ సభ్యులు వేదిరే మేగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విజేయందర్ రెడ్డిలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, మాధరగోని యాదయ్య, బోయపర్తి లింగయ్య, బాజ మనోజ్, జీడిమడ్ల యాదయ్య, కాంగ్రెస్ శ్రేణులు గ్రామస్తులు ఉన్నారు.