26-06-2025 01:16:48 AM
కామారెడ్డి, జూన్ 25 (విజయ క్రాంతి): ఆదివాసి కాంగ్రెస్ పార్టీ ట్రైనింగ్ క్యాంప్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క హాజరయ్యారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా ఆదివాసి కాంగ్రెస్ పార్టీ జిల్లా చైర్మన్ రాణా ప్రతాప్ రాథోడ్ మంత్రిని శాలువాతో సన్మానించారు.
ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా సీతక్క ఇటీవల నియామకం కావడంతో ఉమ్మడి నిజాంబాద్ జిల్లా ఆదివాసి కాంగ్రెస్ పార్టీ జిల్లా చైర్మన్ ప్రధాన రానా ప్రతాప్ రాథోడ్ మంత్రికి జిల్లా పరిస్థితిని వివరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ట్రైనింగ్ క్యాంప్ నేషనల్ ఇన్చార్జి రాహుల్ బాల్ పాల్గొన్నట్లు తెలిపారు.