31 August, 2026 | 6:39 PM

Breaking News

ఎన్నికల హామీలు అమలు చేయాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా   •   సమాజంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి   •   లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో సాధించాలి   •   అంధత్వాన్ని నివారించాలి: అదనపు కలెక్టర్ విక్టర్   •   చిరుతపులి సంచారం... వెంకంపల్లి గ్రామస్తులు ఆందోళన   •   పర్యావరణం పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత   •   ప్రజా ప్రభుత్వంతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి   •   అభివృద్ధిలో కరీంనగర్‎ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: బండి సంజయ్   •   శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలి   •   రైల్వే హబ్ గా గద్వాల జిల్లా అభివృద్ధి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.   •  

పుచ్చలపల్లి సుందరయ్యకు నివాళి

20-05-2024 01:10 AM

 విజయక్రాంతి నెట్‌వర్క్: ప్రజాప్రతినిధిగా ఉండి వచ్చిన జీతా న్నే కాకుండా సొంత ఆస్తులను సైతం పేద ప్రజలకు పంచిన గొప్ప నేత పుచ్చలపల్లి సుందరయ్య అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం ఆయన వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు సీపీఎం నేతలు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీడిత ప్రజలకు సుందరయ్య చేసిన సేవలు మరువలేనివన్నారు. జీవితమంతా ప్రజా సమస్యలపైనే పోరాడారని గుర్తుచేశారు. ప్రజాసేవకు పిల్లలు అడ్డొస్తారనే ఉద్దేశంతో భార్యను ఒప్పించి పిల్లలు కనలే దన్నారు. ఎంపీగా పార్లమెంట్‌కు సైకిల్‌పై వెళ్లిన సదా సీదా నేత సుందరయ్య అని కొనియాడారు.