పసుపు రైతుల ఆశీర్వాదం అదృష్టం

20-04-2024 02:02:09 AM

l నా నామినేషన్ డబ్బులు వారే చెల్లించడం సంతోషం

l రైతుల మద్దతుతో మరోసారి విజయం సాధిస్తా 

l నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్ 

l పసుపు రైతులతో కలిసి నామినేషన్ దాఖలు  

నిజామాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): నిజామాబాద్ పసుపు రైతులు తనను ఆశీర్వదించి, తన నామినేషన్‌కు వారే డబ్బులు ఇవ్వడం తన అదృష్టమని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు.  పంటకు మంచి మద్దతు ధర లభించడంతో పసుపు రైతులు తనను ఆశీర్వదించారని తెలిపారు. పార్లమెంటు పరిధి లోని బాల్కొండ, నిజామాబాద్ రూరల్, జగిత్యాల, కోరుట్ల, ఆర్మూర్ నియోజకవర్గాలకు చెందిన పసుపు రైతులతో కలిసి అర్వింద్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.

కోరుట్ల నియోజకవర్గానికి చెందిన పసుపు రైతు వెల్మ రమేశ్.. అర్వింద్ అభ్యర్థిత్వాన్ని బలపర్చారు. నామినేషన్ కు అవసర మైన రూ.25 వేలను రైతులు చందాలు వేసుకుని సమకూర్చారు. ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో లాగానే ఈ ఎన్నికల్లో సైతం రైతులు తనకు మద్దతు ప్రకటించారని, వారి మద్దతుతో తాను విజయం సాధించనున్నట్టు స్పష్టంచేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు ధన్యవాధాలు తెలియజేశారు.