15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఇద్దరు బైక్ దొంగ‌లు అరెస్ట్‌

12-11-2025 10:32 PM

-  26 బైక్‌లు స్వాధీనం

-  వివ‌రాలు వెల్ల‌డించిన ఎస్పీ న‌ర‌సింహ‌

సూర్యాపేట‌ (విజయక్రాంతి): ఖరీదైన బైకులే లక్ష్యంగా చేసుకుని చోరీల‌కు పాల్ప‌డుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కె.నర‌సింహ‌ వెల్లడించారు. సూర్యాపేట టూటౌన్‌ పోలీసు స్టేషన్ పరిధిలోని ఖమ్మం ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం తెల్లవారుజామున పట్టణ ఇన్‌స్పెక్ట‌ర్ వెంకటయ్య ఆధ్వర్యంలో ఎస్ఐ సురేశ్ సిబ్బందితో వాహనాల‌ తనిఖీ చేప‌ట్టారన్నారు. అదే సమయంలో బైక్‌పై అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపి తనిఖీ చేశారన్నారు. ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్‌వ‌ర్క్ సిస్టం ద్వారా అతడి వేలిముద్రలు తనిఖీ చేసి అత‌డిపై సుమారు 50 బైక్ చోరీ కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు.

వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా చిలుకూరు మండలం కటకొమ్ముగూడెం గ్రామానికి చెందిన వేమూరి కృష్ణగా వివరాలు చెప్పాడన్నారు. ఇతను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసే నకిరేకల్ మండలం ఆర్లగడ్డగూడెం గ్రామానికి చెందిన రేఖల శివకుమార్ తో కలిసి సూర్యాపేట పట్టణం, ఖమ్మం, మిర్యాలగూడ, నల్ల‌గొండ‌, హైదరాబాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్‌ని పలు ప్రాంతాల్లో ఖరీదైన బైక్‌ల‌ను చోరీ చేసిన‌ట్లు తేలిందన్నారు. వీరి నుంచి 26 బైక్‌లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు త‌ర‌లించామన్నారు. సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, ఇన్‌స్పెక్ట‌ర్ వెంకటయ్య, ఎస్ఐ సురేశ్ పాల్గొన్నారు.