17 April, 2026 | 2:45 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

బోరు బావి నుంచి ఉబికి వస్తున్న నీరు

12-11-2025 10:34 PM

కామారెడ్డి జిల్లాలో ఓ రైతు పొలంలో అద్భుతం..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఓ రైతు పొలంలో ఉన్న బోరుబావి నుంచి ఎలాంటి విద్యుత్ మోటార్ కనెక్షన్ లేకుండానే బోరు నుంచి నీరు ఉబికి వస్తుంది. సంఘటన చూసి గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం బంజర గ్రామ సమీపంలో రైతు నాయక్ పొలంలో గత కొన్ని మాసాలుగా ఎండిపోయిన ఈ బోరు బావి నుంచి ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల భూగర్భ జలాలు పెరగడంతో 150 అడుగుల లోతు నుంచి నీటితో బోర్ నుంచి నీరు పొంగి పొర్లుతుంది. విద్యుత్ మోటార్ లేకుండానే నీరు బోరు నుంచి పైకి రావడంతో గ్రామస్తులు ఆశ్చర్యంతో తిలకిస్తున్నారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది.