calender_icon.png 16 June, 2025 | 5:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైలు నుంచి జారిపడి ఇద్దరి మృతి

16-06-2025 12:00:00 AM

బెల్లంపల్లి అర్బన్, జూన్ 15: మంచిర్యాల జిల్లా రేచీనీ - బెల్లంపల్లి రైల్వే స్టేషన్ మధ్య ఆదివారం ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. జీఆర్‌పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. 6:40 గంటలకు  ఇద్దరు వ్యక్తులు గుర్తు తెలియని డౌన్ రైలు బండిలో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు రేచిన్ రోడ్ - బెల్లంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య పడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయారు.

మృతుల్లో ఒకరీ వయ సు 40-45 సంవత్సరాలు, బక్కపలుచని దేహం, తెల్లని లాల్చీ పైజామా ధరించాడు.  రైలు ప్రయాణం టికెట్ నాగపూర్ నుంచి కాచిగూడ వరకు టికెట్ ఉందన్నారు. మరొకరీ వయసు 25--30 సంవత్సరాలు, బక్క పలుచని దేహం, బెల్లం రంగు ఫుల్ హ్యాండ్స్ వింటర్ స్వెట్టర్, మెరూన్ రంగు ఫుల్ హ్యాండ్స్ షర్ట్, గోధుమ రంగు జీన్స్ ప్యాంట్ ధరించాడని, ఎడమ చేతి పైన అమ్మ, నాన్న అని పచ్చ బొట్టు కలదు. 

చనిపోయిన ఇద్దరు వ్యక్తులు బహుశా ముస్లింలు పోలీసు భావిస్తున్నారు. వివరాలు తెలిసినవారు ఈ ఫోన్ నంబర్లకు 87126 58596, 94908 71784, 99493 04574 కోరారు. ఈ మేరకు మంచిర్యాల రైల్వే ఎస్సై మహేందర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.