calender_icon.png 16 June, 2025 | 8:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భజన, కీర్తన మన ధర్మం, మన బాధ్యత

15-06-2025 10:59:03 PM

అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ప్రతినిధి మాన్ ప్రణవానంద దాస్..

కామారెడ్డి (విజయక్రాంతి): భజన, కీర్తన, మన ధర్మం బాధ్యత అని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ప్రతినిధి మాన్ ప్రణవానంద దాస్(Man Pranavananda Das) అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కృష్ణ భవన్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మన ధర్మం బాధ్యత గురించి ప్రవచనాలు వినిపించారు. జిల్లాలోని ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ముఖ్య అతిథులుగా మాన్ ప్రనవానంద దాస్ హాజరయ్యారు. 

కామారెడ్డి జిల్లా కామారెడ్డి పట్టణంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ముఖ్య అతిథులుగా మాన్ ప్రనవానంద దాస్ ను కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ధర్మశాల నుండి మంగళ హారతులతో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంకు భారీ ఎత్తున మహిళలు, కృష్ణ ప్రభూతి, పట్టణ ఆర్య వైశ్య సంఘం సభ్యులు భక్తులు పాల్గొని మాన్ ప్రనవానంద దాస్ కు ఘనంగా సన్మానించిన కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మొగిలిపల్లి భూమేష్ గుప్తా, కామారెడ్డి జిల్లాలోని ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.

కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మొగిలిపల్లి భూమేష్ మాట్లాడుతూ కామారెడ్డికి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ప్రతినిధి మాన్ ప్రణవానంద దాస్ రావడం మన కామారెడ్డి జిల్లా ప్రజల పూర్వజన్మ సుకృతమని అన్నారు. భజన్,కీర్తన్ మన గుడి మనధర్మం మన బాధ్యతపై ప్రవచనం, హారతి, అన్నప్రసాద్ వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. కామారెడ్డి సిరిసిల్ల రోడ్డు లోని ధర్మశాల నుండి బైక్ ర్యాలీ, నిర్వహించారు. పాదయాత్ర భక్తులు 4000 వేల మంది పాల్గొన్నారని తెలిపారు.