21-05-2025 05:46:04 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District)లో బుధవారం పిడుగుపాటుకు గురై ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. గూడూరు మండలం గుండెంగా గ్రామానికి చెందిన మైదం ప్రవీణ్ కుమార్(27) బహిర్భూమికి వెళ్ళగా వర్షం వస్తుండడంతో చెట్టు వద్ద ఉండగా పిడుగు పడడంతో దుర్మరణం పాలయ్యాడు. అలాగే కొత్తగూడా మండలం ఓటాయి గ్రామంలో గొర్రెల కాపరి దేశ బోయిన చేరాలు(55) పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.