15 June, 2026 | 6:13 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి   •   పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •  

ఇంకో రెండు రోజులు వానలు

04-09-2024 12:27 AM

ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): రాష్ట్రానికి రెండు రోజుల పాటు ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ (ఐఎండీ) జారీ చేసింది. రాష్ట్రంలో మంగళవారం మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లాలో 49 మి.మీ మేర వర్షం కురియగా.. ఆదిలాబాద్‌లో 31 మి.మీ మహబూబ్ నగర్‌లో 15.8 మి.మీ మేర వర్షం కురిసినట్లు ఐఎండీ తెలిపిం ది. బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, జోగులాంబ గద్వాల జిల్లా ల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లా ల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్త రు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం ఉదయం తర్వా త వాతావరణంలో మార్పు చోటు చేసుకుంటుందని, వర్షాల తాకిడి తగ్గుతుందని అధికారులు వెల్లడించారు.