04-02-2026 01:31:37 AM
హనుమకొండ టౌన్ ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా యాదవ నగర్ ఎస్సారెస్పీ కెనాల్ కాల్వలో ఈతకు వెళ్లిన ఇద్దరి యువకులు మృతి చెందిన ఘటన పట్టణంలో చోటుచేసుకుంది. హైదరాబాద్ కు చెందిన మస్తాన్(17), సోను ( 24) ఇద్దరు యువకులు ఓ పండ్ల వ్యాపారి వద్ద కూలీలుగా పనిచేస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం నుంచి చింతగట్టు క్యాంపు కెనాల్ పక్కన పండ్లు అమ్ముకుంటూ, అక్కడే ఉండేవారు. ప్రతిరోజు పండ్ల వ్యర్ధాలను హనుమకొండ యాదవ నగర్ సమీపంలోని కెనాల్ పక్కన వేస్తుండేవారు.
ఈ క్రమంలో మంగళవారం కూడా కుళ్లిన పండ్లతో పాటు చెత్తను కెనాల్ పక్కన పడేయడానికి వెళ్లారు. అనంతరం యాదవ నగర్ ఎస్సార్ఎస్పీ కెనాల్లో స్నానాలు చేస్తుండగా ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు యువకుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.