calender_icon.png 4 February, 2026 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సారెస్పీ కాల్వలో ఇద్దరు గల్లంతు

04-02-2026 01:31:37 AM

  1. హైదరాబాద్‌కు చెందిన మస్తాన్, సోనుగా గుర్తింపు 
  2. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
  3. హనుమకొండ జిల్లా యాదవ నగర్ కెనాల్ వద్ద ఘటన

హనుమకొండ టౌన్ ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా యాదవ నగర్ ఎస్సారెస్పీ కెనాల్ కాల్వలో ఈతకు వెళ్లిన ఇద్దరి యువకులు మృతి చెందిన ఘటన పట్టణంలో చోటుచేసుకుంది. హైదరాబాద్ కు చెందిన మస్తాన్(17), సోను ( 24) ఇద్దరు యువకులు ఓ పండ్ల వ్యాపారి వద్ద కూలీలుగా పనిచేస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం నుంచి చింతగట్టు క్యాంపు కెనాల్ పక్కన పండ్లు అమ్ముకుంటూ, అక్కడే ఉండేవారు. ప్రతిరోజు పండ్ల వ్యర్ధాలను హనుమకొండ యాదవ నగర్ సమీపంలోని కెనాల్ పక్కన వేస్తుండేవారు.

ఈ క్రమంలో మంగళవారం కూడా కుళ్లిన పండ్లతో పాటు చెత్తను కెనాల్ పక్కన పడేయడానికి వెళ్లారు. అనంతరం యాదవ నగర్ ఎస్సార్‌ఎస్పీ కెనాల్‌లో స్నానాలు చేస్తుండగా ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు యువకుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.