26-06-2025 08:21:40 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ మహేందర్(SI Mahender) తెలిపిన వివరాల ప్రకారం.. కొంతకాలంగా అక్రమంగా ఇసుక తరలింపు జోరుగా జరుగుతుంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు వివిధ ప్రాంతాల నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నారు. పట్టుబడిన ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ తరలించారు, పోలీస్ స్టేషన్ కి తరలించిన ఇసుకను రెవెన్యూ అధికారులు ఆర్ఐ రమేష్ ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు. పట్టుకున్న రెండు ట్రాక్టర్ల ఇసుక వేలం పాటలో రూ. 3200 కి సిరికొండ సుస్మిత్ కైవసం చేసుకున్నట్లు తెలిపారు.