రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి
నాగిరెడ్డిపేట్,(విజయ క్రాంతి): రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని డిఏఓ మోహన్ రెడ్డి,ఏడిఏ సుధా మాధురి వీక్షించారు. వీడియో కాన్ఫిడెన్స్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏల్ నీనో ప్రభావం ఉన్నందున తెలంగాణ రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపవలసిందిగా నిర్దేశించారు.
ఆరుతడి పంటల్లో ముఖ్యంగా కంది, జొన్న, మినుములు, పెసర్లు, పొద్దుతేరుగుడు పువ్వు వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తూ బోరు బావులలో వంగడాలను సాగు చేయవలసిందిగా కోరినట్లు స్థానిక ఏవో సాయికిరణ్ తెలిపారు. కావున మండలంలోని రైతులు ఆరుతాడి పంటలపై మొగ్గు చూపాలని ఏవో సాయికిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఏఓ మోహన్ రెడ్డి, ఏడిఏ సుధా మాధురి, ఏడిఏ టెక్నికల్ చంద్రజ్యోతి, మాల్తుమ్మెద సీట్ ఫామ్ ఏడిఏ ఇంద్రసేన్, ఏవో సాయికిరణ్, ఏఈఓ లు రైతులు పాల్గొన్నారు.






