ఏరియాను సందర్శించిన కార్పొరేట్ జిఎం(ఆర్ అండ్ డి) నారాయణ రావ్
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి కార్పొరేట్ కార్యాలయం(Singareni Corporate Office)లో జిఎం (ఆర్ అండ్ డి)గా విధులు నిర్వహిస్తున్న నారాయణరావు గురువారం ఏరియాను సందర్శించారు. ఏరియా పర్యటనకు వచ్చిన ఆయనను ఏరియా జిఎం జి దేవేందర్ ఘన స్వాగతం పలికారు. ఈనెల 30న పదవీ విరమణ పొందనున్న ఆయనను జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏరియా జిఎం మాట్లాడుతూ... సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న ప్రతి అధికారికి పదవీ విరమణ తప్పదని అన్నారు. పదవి విరమణ అనంతరం వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో సాగాలని ఆయన ఆకాంక్షించారు.
బదిలీపై వెళ్తున్న అధికారికి...
సింగరేణి ఏరియా ఫారెస్ట్ మేనేజర్ గా విధులు నిర్వహించి బదిలీపై కొత్తగూడెం వెళ్తున్న ఆర్ రమణారెడ్డి ని ఏరియా జిఎం జి దేవేందర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ.. సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు బదిలీలు సహజమని అధికారులు తమ పని చేసిన ప్రదేశాల్లో కార్మికుల అధికారుల ఆదరాభిమానాలు పొందాలని కోరారు. ఫారెస్ట్ అధికారిగా ఏరియాకు అందించిన సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ ఓ టు జిఎం విజయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, ఎస్ఇ ఐఇడి కె కిరణ్ కుమార్, డీజీఎం ఎఫ్ & ఎ ఆర్విఎస్ఆర్కె ప్రసాద్, పర్చేస్ అధికారి బాబు, ఏరియా అధికారులు పాల్గొన్నారు.






