30 May, 2026 | 11:54 PM

Breaking News

ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు   •   ఖాతాదారుల సేవా కేంద్రం నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం   •   గిరిజన యువతీ యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం   •   మండల టాపర్‌ మేకా మాన్వితకు ట్రిపుల్ ఐటీ సీటు   •   పెద్దమల్లారెడ్డిలో అగ్నిప్రమాదం.. గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధం   •   వరికొయ్యలు కాల్చవద్దు... బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు   •   కూచిపూడి నృత్యంతో అలరించిన మోక్ష ధృతి   •   అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలి: సీడీపీవో జ్యోతి   •   ఘట్కేసర్ లో ప్రారంభమైన సిపిఎం శిక్షణ తరగతులు   •   రైతు డిస్కమ్ రైతాంగానికి శాపం   •  

సంప్‌లో ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతి

09-09-2025 04:08 PM

హైదరాబాద్: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో(bhadradri kothagudem district) మంగళవారం ఇద్దరు కార్మికులు అనుమానాస్పదంగా ఊపిరాడక మరణించగా, మరో ఇద్దరు ఆసుపత్రి పాలయ్యారని పోలీసులు తెలిపారు. చెర్ల మండలంలో తాగునీటి సరఫరా పథకంలో భాగంగా నిర్మిస్తున్న సంప్(water sump) కోసం నలుగురు కార్మికులు సిమెంట్ పనిలో నిమగ్నమై ఉండగా ఈ సంఘటన జరిగింది. ఒక సీనియర్ పోలీసు అధికారి ప్రకారం.. మొదట ఒక కార్మికుడు సంప్‌లోకి ప్రవేశించి సహాయం కోసం పిలిచాడు. మరో ముగ్గురు అతన్ని రక్షించడానికి లోపలికి వెళ్లారు. కానీ ఇద్దరు ఆక్సిజన్ లేకపోవడం వల్ల స్పృహ కోల్పోయి తరువాత మరణించారు. మిగిలిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. సంప్‌ లోపల ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల ఊపిరాడక మరణాలు సంభవించాయని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, పోస్ట్ మార్టం పరీక్ష తర్వాత ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.