20-11-2025 12:13:59 AM
-లో వోల్టేజ్ సమస్యలతో 13 గ్రామాల రైతుల కష్టాలు
-ఎమ్మెల్యే అధికారులకు చెప్పిన పరిష్కారం కరువే...
కుభీర్, నవంబర్ 19: (విజయక్రాంతి) నిర్మ ల్ జిల్లా కుభీర్ మండలంలోని మాలే గాం రైతుల అవసరాల కోసం నిర్మించిన సబ్స్టేష న్ రెండేళ్లు పూర్తవుతున్న ప్రారంభానికి లోచుకోవడం లేదు దీంతో వాలిగాం తో పాటు 13 గ్రామాలకు చెందిన రైతులకు లోగొట్టే సమస్య ఏర్పడి ఓటర్లు స్టాటర్లు కాలిపోవడమే కాకుం డా పంటలకు సాగునీరు అంది పరిస్థితి లేకపో వడంతో రైతులు చెందుతు న్నారు కెసిఆర్ ప్రభుత్వం 2022 లో రూ. 1కోటి 10 లక్షలతో విద్యుత్ ఉప కేంద్రం మంజూరు చేసి పనులను పనులు పూర్తి చేశారు అంతలోనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చింది.
విద్యుత్ ఉప కేంద్రం పనులన్నీ పూర్తయి రెండేళ్లు గడి చిపోతున్నా దాన్ని ప్రారంభించేందుకు ఆ శాఖ అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కొత్తగా సబ్స్టేష న్ మంజూరు కావడంతో తమ కష్టాలు తీరుతాయని రైతులు భావించారు ఖరీఫ్ యా సంగి సీజన్ లో రెండు పంటలు పండించుకో వచ్చని ఆశపడ్డ రైతులకు గత రెండేళ్లుగా సబ్స్టేషన్ ప్రారంభానికి నోచుకోకపోవడంతో నిరాశే ఎదురయింది మాలేగావ్ చుట్టుపక్కల 13 గ్రామాల రైతులకు సమస్య వేధిస్తోంది. ప్రస్తుతం ఇతర ప్రాంతంలో ఉన్న సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా కావడంతో సమస్య ఏర్పడి మోటర్లు స్టార్టర్లు కాలిపోతున్నాయని నిరంతరంగా విద్యుత్ సరఫరాలో అంతరా యం ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
ఆందోళనకు సిద్ధమవుతున్న రైతులు
యాసంగి ప్రారంభం కావడంతో ఇప్పటికే చాలామంది రైతులు యాసంగిలో బోర్లు బావుల కింద మొక్కజొన్న, నువ్వు, శనగ తదితర పంటలు సాగు చేసిన రైతులకు సాగు చేసి న భూములకు నీరు పారడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఒకరోజు దినంలో కనీసం రెండు పట్టెలు కూడా పారడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ జిల్లా విద్యుత్ శాఖ అధికారి స్పందించి మాలేగాం లో నిర్మించి పనులు పూర్తయిన విద్యుత్ ఉప కేంద్రాన్ని వెంటనే ప్రారంభించే విధంగా చర్య లు చేపట్టాలని ఈ ప్రాంత రైతులు కోరుతు న్నారు.
మండల రైతులు ఖరీఫ్లో సాగు చేసిన పంటలు అధిక వర్షాల వల్ల ప్రకృతి కన్నెర్రతో సాగుకు పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రాక తీవ్ర నష్టాల్లో మునిగిపో యిన సంగతి తెలిసిందే. ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని‘ అన్న చందంగా మారిందని పంటలు సాగుచేసిన రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. జిల్లా అధికారుల నిర్ల క్ష్యం, ముందు చూపులేని విద్యుత్ శాఖ అధి కారుల కారణంగా రైతులు దినమంతా పంపు సెట్ల ద్వారా కనీసం అరా ఎకరానికి కూడా నీరందించలేని పరిస్థితి ఏర్పడిందని అనధి కారిక విద్యుత్ కోతలు, తరచూ ఎల్సి ఇవ్వడం, మరమ్మత్తుల పేరిట విద్యుత్ సరఫరాలో అంతరాయం, ముఖ్యంగా లోవోల్టేజీ సమస్య రైతులను వేధిస్తోంది.
మాలేగాం తో పాటు చుట్టుపక్కల 15 గ్రామాలకు విద్యుత్ సమస్య వెంటాడడంతో సాగుచేసిన పంటలు ఎండిపో తాయన్న భయం రైతులను పట్టిపీడిస్తోంది. గతేడాది యాసంగిలో విద్యుత్ సమస్యలు తలెత్తి కుంటాల మండలం లోని ఓలా ఇతర సబ్ స్టేషన్ల నుండి ప్రత్యేక లైన్ వేసి మండల రైతులకు విద్యుత్ సరఫరా చేశారు. ఈ యేడు వర్షాలు అధికంగా కురిసిన నేపథ్యంలో శనగ తోపాటు మొక్కజొన్న, నువ్వు తదితర పంట లు ఈపాటికే యాభై శాతం రైతులు సాగు చేశారు.
గతేడాది ఈ యేడు యాసంగిలో సాగు విస్తీర్ణం రెట్టింపు అయ్యింది. అయినప్ప టికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాసంగి సీజన్ కు ముందే పంటలు సాగు చేయవద్దని విద్యుత్ శాఖ అధికారులు గ్రామాల ప్రజలకు చెప్పినట్లయితే పంటలను ఎందుకు సాగు చేసుకునే వారము. సాగు చేసుకున్న తర్వాత ఈ కరెంటు కోతల బాధ విధిస్తున్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు విద్యుత్ శాఖ జిల్లా అధికారులు స్పందించి వెంటనే మలేగాం లో నిర్మించి పూర్తి చేసిన విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభించి సాగు రైతులను ఆదుకోవాలి. లేనిపక్షంలో రైతుల అందరితో కలిసి కుభీర్ విద్యుత్ ఉపకేంద్రం ముందు నిరాహార దీక్షలు చేస్తాం.
సబ్ స్టేషన్లు వెంటనే ప్రారంభించండి
నేను 10 ఎకరాల్లో మొక్కజొన్న, పసుపు సాగు చేశాను. విద్యు త్ సరఫరాలో తరచూ అంతరాయం, లోవోల్టేజి మూలంగా దినమంతా నీరిస్తే ఒక పట్టే తడవడం లేదు. కెసిఆర్ ప్రభుత్వంలో రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందించి కనురెప్పపాటు కూడా కరెంటు పోకుండా రైతులకు భరోసా కల్పించారు. మున్ముందు రైతులకు లోవోల్టేజీ సమస్య తలెత్తకుండా విద్యుత్ ఉప కేంద్రం నిర్మించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ దాన్ని ప్రారంభించకపోవడం ఈ ప్రాంత రైతులను మోసం చేయడమే అవుతుంది. కచ్చకాయల శంకర్, రైతు, మాలేగాం
రైతులకు కరెంటు కష్టాలు
నేను సుమారు 20 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. బోరుబావుల్లో పుష్కలంగా నీరున్నా.. సాగు చేసిన భూమిని తడపడం కష్టంగా మారింది. ఒక గంటలో పది సార్లు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడుతోంది. కన్నులుండి చూడలేని గుడ్డి ప్రభుత్వమిది. విద్యుత్ ఉప కేంద్రం ప్రారంభించక రెండేళ్లు గడిచి పోతున్నా రైతులపై కనికరం లేదు. ప్రస్తుతం పంటలు సాగుచేసిన రైతుల పరిస్థితి ’కొరకరాని కొయ్య’ లా తయారైంది. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే మలేగాం లోని విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించాలి.
బంజ గణేష్, రైతు, మాలేగాం