10-06-2025 01:18:30 AM
న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది: హరీశ్రావు
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి)/రాజేంద్రనగర్: కాళేశ్వరం కమిషన్ ముందు సోమవారం విచారణకు హాజరైన మాజీమంత్రి హరీశ్రావు.. అంతకు ముందు కోకాపేటలోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. న్యాయవ్యవస్థ, చట్టాలు, రాజ్యాంగం మీద తనకు, బీఆర్ఎస్ పార్టీకి అపారమైన నమ్మకం ఉందని, అందుకే కమిషన్ ముందు హాజరు అవుతున్నామని చెప్పారు.
కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని పేర్కొన్నారు. ఆ తర్వాత తెలంగాణ భవన్కు వచ్చారు. అక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో భేటీ అయ్యారు. అదే సమయంలో పలువురు సీనియర్ నేతలు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. భవన్ నుంచి కమిషన్ ఆఫీస్కు వెళ్లే సమయంలో భారీ సంఖ్యలో తరలొచ్చిన నేతలు, కార్యకర్తలు ఆయనతో కలిసి బయలుదేరారు.
ఈ సమయంలో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున నినాదా లు చేశారు. మీడియాతో మాట్లాడిన తర్వాత నేరుగా కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఎర్రవెల్లికి చేరుకున్నారు. కమిషన్ విచారణ జరిగిన తీరు, అడిగిన ప్రశ్నలు, తానిచ్చిన సమాధానాలు, ఆధా రాలను కేసీఆర్తో సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం.
ఈనెల 11న కేసీఆర్ కమిషన్ ముందు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు తరలిరావాలని పార్టీ పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. కాగా కేసీఆర్ పార్టీ ముఖ్యనేతలతో మంగళవారం సమావేశం నిర్వహించనున్నట్టు తెలిసింది.