10-06-2025 01:20:25 AM
- సాంకేతిక సమస్యల నేపథ్యంలో గడువు పెంచిన సర్కార్
- డీలర్ల వద్ద సరిపడా స్టాక్
- రేషన్కార్డుదారులకు ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): జూన్, జూలై, ఆగస్టుకు సంబంధించిన రేష న్ పంపిణీ ప్రక్రియను ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు సోమవారం రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. మునుపటి ప్రకటన ప్రకారం.. ఈనెల 2వ తేదీన పంపిణీ ప్రారంభించి 10లోపు ముగించాల్సి ఉండగా, క్షేత్రస్థాయి లో సాంకేతిక, రవాణాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
డీలర్లు ఈ య ంత్రాల్లో వేలిముద్ర సేకరించేటప్పుడు సర్వర్ సమస్యలు తలెత్తుతున్నాయి. సర్కార్ వాటిని పరిగణలోకి తీసుకుని పంపిణీ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. రేషన్కా ర్డుదారులెవరూ ఆందోళన చెందాల్సిన అవ సరం లేదని, ప్రతి కుటుంబానికి సరిపడా స్టాక్ డీలర్ల వద్ద ఉందని సర్కార్ స్పష్టం చేసింది.