19-12-2025 08:53:56 PM
18 మందిపై బైండోవర్ కేసు నమోదు
ఎస్ఐ చలిగంటి నరేష్
గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో స్థానిక ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్ పై జరిగిన దాడి కేసులో 18 మంది పై బైండోవర్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చలిగంటి నరేష్ తెలిపారు. బుధవారం జరిగిన ఘర్షణలో ఎడవెల్లి చంద్రారెడ్డి అనే మాజీ సర్పంచ్ కౌంటింగ్ ఏజెంట్ గా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా టిఆర్ఎస్ పార్టీ ఓటమిని అంగీకరించలేక కౌంటింగ్ ఏజెంట్ గా ఉన్నటువంటి చంద్రారెడ్డిపై టిఆర్ఎస్ అభ్యర్థి కుటుంబ సభ్యులు, కొందరు స్థానిక, స్థానికేతరులు అయినా అల్లరి మూకలను వెంటబెట్టుకొని కౌంటింగ్ హాల్ పై దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో గాయపడిన ఎడవెల్లి చంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పది మంది పై కేసు నమోదు చేసి అదేవిధంగా సోషల్ మీడియాలో వాట్సాప్ ఇంస్టాగ్రామ్ లలో ఫేక్ న్యూస్ క్రియేట్ చేసిన మరికొంతమందిని మొత్తం 18 మందిని శుక్రవారం రోజు హుజూర్నగర్ ఆర్డీవో ముందు బైండోవర్ చేయడం జరిగిందని ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపినారు.