16 March, 2026 | 8:50 PM

Breaking News

కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •   ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పన   •   ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పక్కాగా అమలు చేయాలి   •  

తల్లి మృతి తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య

08-01-2026 01:37 AM

గొల్లపల్లి మండలం బిబిరాజ్‌పల్లిలో ఘటన

ధర్మపురి, జనవరి 7(విజయక్రాంతి): తల్లి మృ తిని తట్టుకోలేక గొల్లపల్లి మండలం బిబిరాజ్ పల్లి గ్రామానికి చెందిన మల్యాల రామ్ చరణ్(20)ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ ఎం. కృష్ణ సాగర్ రెడ్డి తెలిపారు. రామ్ చరణ్ తల్లి అంజవ్వ గత సంవత్సరం అనారోగ్యం కారణంగా చనిపోయిం ది. అప్పటినుంచి రామ్ చరణ్ తన అమ్మ మృ తిని జీర్ణించుకోలేక ప్రతిరోజు బాధపడుతూ ఉం డేవాడు. ఈ క్రమంలో అమ్మను తలుచుకుంటూ మానసికంగా బాగా కృంగిపోయి, జీవితంపై విర క్తి చెందేవాడు. తన ఇంట్లో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, రామ్ చరణ్ తండ్రి  గంగరాజం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.